నడుస్తున్న కారులో వివాహిత రేప్
భూపాల్: లిప్టు పేరుతో వారు భార్యాభర్తలను కారులో ఎక్కించున్నారు. కారు ప్రయాణిస్తుండగానే భర్త ఎదుట వివాహితను నలుగురు అత్యాచారం చేసిన ఘటన భూపాల్లో జరిగింది. వివరాలివి...ముంబయి నుంచి ప్రమోద్ దంపతులు భూపాల్ వచ్చారు. బుధవారం రాత్రి ప్రమోద్, ఆయన భార్య గాంధీనగర్ లోని బాపు ఆశ్రమం వద్ద బస్సు కోసం వేచి చూస్తుండగా, ఇన్నోవా కారులో వచ్చిన దుండగలు వారిని లిప్ప్టు పేరుతో తమ వాహనంలో ఎక్కించుకున్నారు. కారు డ్రైవర్ కాకుండా ముగ్గురు ఉన్న దుండగులు కొంత దూరం ప్రయాణించాక, ప్రమోద్ కణతపై రివాల్వర్ ను పెట్టి ఆయన భార్యపై ఒకరి తర్వాత ఒకరు అత్యాచారం జరిపారని పోలీసులు తెలిపారు.
వాహనం ప్రయాణిస్తుండగానే వారీ దుర్మార్గానికి పాల్పడ్డారని చెప్పారు. తర్వాత వారిని నిర్మానుష ప్రాంతంలో వదిలిపెట్టారని, దంపతులు ఈ దురాగ తంపై గాంధీనగర్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారని తెలిపారు. బాధితురాలిని ఆస్పత్రిలో చేర్పించారు. నిందితులను పట్టుకోవడానికి ప్రయత్నిస్తున్నారు.