వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
మరో మూడు స్వైన్ ఫ్లూ కేసులు
బెంగుళూర్: కర్నాటక రాజధాని బెంగుళూర్ లో మరో మూడు స్వైన్ ఫ్లూ కేసులు బయట పడ్డాయి. దీంతో భారత దేశంలో నమోదైన స్వైన్ ఫ్లూ కేసుల సంఖ్య 38కి చేరుకుంది. కొత్తగా స్వైన్ ఫ్లూ సోకిన ముగ్గురిలో ఇద్దరు భారత జాతీయులు వీరు థాయ్ లాండ్ నుంచి బెంగుళూర్ వచ్చారు. మరొకరు అమెరికాకు చెందిన 12 ఏళ్ల బాలుడు.
ఆ ముగ్గురు ప్రయాణికులను రాజీవ్ గాంధీ ఛాతీ వ్యాధుల సంస్థలో చేర్చారు. ఈ మూడు కేసులతో బెంగుళూర్ లో స్వైన్ ఫ్లూ సేకిన వారి సంఖ్య ఐదుకు చేరుకుంది. అమెరికా నుంచి వస్తున్నవారే ఎక్కువగా ఈ వ్యాధి సోకినట్లు వైద్యులు గుర్తించారు. స్వైన్ ఫ్లూ వ్యాధి వ్యాప్తి చెందకుండా చర్యలు తీసుకోవాలని భారత్ అభివృద్ధి చెందిన దేశాలను కోరింది.
Story first published: Thursday, June 18, 2009, 11:52 [IST]