హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ప్రభుత్వ ఖజానా నుంచే జీతాలు:సీఎం

By Staff
|
Google Oneindia TeluguNews

YS Rajasekhar Reddy
హైదరాబాద్‌: మున్సిపల్‌ శాఖ, పురపాలక సంఘాల్లో పనిచేసే ఉద్యోగులకు ప్రభుత్వ ఖజానా నుంచే జీతభత్యాలు చెల్లించాలని ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర రెడ్డి అధికారులను ఆదేశించారు. ఏప్రిల్‌ 2009 నుంచి దీనిని అమలు చేయాలని వైఎస్‌ నిర్ణయించారు. మున్సిపల్‌ ఉద్యోగుల జీతభత్యాలకు సంబంధించి సచివాలయంలో ఆర్థికశాఖ, పురపాలక శాఖ అధికారులతో ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించారు.

గ్రేటర్‌ హైదరాబాద్‌, విజయవాడ మున్సిపల్‌ కార్పొరేషన్‌, గ్రేటర్‌ విశాఖ కార్పొరేషన్‌ ఉద్యోగులు మినహా మిగిలిన పురపాలక సంఘాల ఉద్యోగులకు ఇక నుంచి ప్రభుత్వమే జీత భత్యాలు చెల్లిస్తుందని పురపాలక శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి తెలిపారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X