ఒంగోలు: ప్రజారాజ్యం పార్టీ అధినేత చిరంజీవికి ప్రకాశం జిల్లా పర్చూరు కోర్టు సమన్లు జారీ చేసింది. ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించినందుకు కోర్టు ఆయనకు ఈ సమన్లు జారీ చేశారు. ఈ నెల 29వ తేదీకి కేసు విచారణ వాయిదా పడింది.
ఎన్నికల సందర్భంగా ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించారంటూ పర్చూరులో చిరంజీవిపై కేసు నమోదైంది. ఈ కేసు విచారణకు చిరంజీవి హాజరు కాకపోవడంతో కోర్టు సమన్లు జారీ చేసినట్లు సమాచారం.