హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

అన్ని గ్రామాలకు రక్షిత నీరు: సీఎం

By Staff
|
Google Oneindia TeluguNews

YS Rajasekhar Reddy
హైదరాబాద్‌: రాష్ట్రంలో మంచినీటి సమస్య ఉన్న అన్ని గ్రామాలకు ఆగస్టు 15నుంచి రక్షిత నీరు సరఫరా చేస్తామని ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖరరెడ్డి అన్నారు. జూబ్లీహాలులో శుక్రవారం జరిగిన జిల్లా కలెక్టర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. రక్షితనీటిని ప్రజలకు బాటిళ్లద్వారా అందిస్తామన్నారు. బాటిళ్ల ద్వారా మంచినీరు సేవించడం వల్ల అంటువ్యాధులు తగ్గుతాయని ఆయన చెప్పారు.

దసరా నుంచి పల్లెల్లో ఆకస్మిక తనిఖీలు చేపట్టి పథకాల అమలు గురించి తెలుసుకుంటామన్నారు. ప్రజానాడిని మరెవరి ద్వారానో కాక నేరుగా తెలుసుకునేందుకు ఈ ఆకస్మిక తనిఖీలు చేపట్టనున్నట్లు ఆయన తెలిపారు. ప్రభుత్వ పథకాల అమలు బాగానే ఉందని అన్నారు. తెలిసి అధికారులు తప్పు చేస్తే క్షమించేది లేదన్నారు. అవినీతిని ఎట్టి పరిస్థితిలోనూ అనుమతించవద్దని ఆయన జిల్లా కలెక్టర్లకు సూచించారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X