హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

గుర్తు మార్చమంటూ పీఆర్పి ప్రయాణం

By Staff
|
Google Oneindia TeluguNews

Chiranjeevi
హైదరాబాద్‌: ప్రజారాజ్యం పార్టీ తమకిచ్చిన రైలు గుర్తును మార్చటానికి నిర్ణయించుకుంది. రైలుకు బదులుగా సూర్యుడు గుర్తును కేంద్ర ఎన్నికల సంఘాన్ని కోరనున్నారు. దీని నిమిత్తం ప్రజారాజ్యం పార్టీ ప్రతినిధులు ఈ రోజు ఢిల్లీ వెళ్తున్నారు. ఇటీవల ఎన్నికల్లో 18 సీట్లు, 17శాతం ఓట్ల సాధించి రాజకీయ పార్టీగా గుర్తింపు పొందింది. దీంతో కొత్త గుర్తుకోసం పార్టీలో చర్చించారు. ఎక్కువ మంది నేతలు సూర్యుని గుర్తు వైపు మొగ్గు చూపారు. దాంతో ఈ గుర్తుకోసం కేంద్ర ఎన్నికల సంఘానికి ప్రజారాజ్యం దరఖాస్తు చేయనుంది. ఈ మేరకు పార్టీ సీనియర్‌ నేత సి.రామచంద్రయ్య ఢిల్లీ బయలు దేరి వెళ్తారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X