ర్యాంకర్ల సీట్లపై చేతులెత్తేసిన ఎంసిఐ
హైదరాబాద్: వయోపరిమితి సరిపోని ఎంసెట్ మెడిసిన్ ర్యాంకర్ల సీట్లపై భారత వైద్య మండలి (ఎంసిఐ) చేతులెత్తేసింది. వయోపరిమితి సరిపోనందున 9వ ర్యాంకర్ సాయిరాంకు మెడిసిన్ లో అధికారులు అడ్మిషన్ నిరాకరించిన విషయం తెలిసిందే. అదే విధంగా శాంతి అనే అమ్మాయికి కూడా 17 ఏళ్ల వయస్సు దాటకపోవడంతో అధికారులు సీటు నిరాకరించారు. ఆమెకు ఆరు రోజుల వయస్సు తక్కవ పడింది.
ఆ ర్యాంకర్ల అడ్మిషన్ పై ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర రెడ్డి మంగళవారం ఎంసిఐ చైర్మన్ తో ఫోన్ లో మాట్లాడారు. అయితే తామేమీ చేయలేమని చైర్మన్ ముఖ్యమంత్రితో చెప్పారు. దీంతో ఆ ర్యాంకర్ల అడ్మిషన్ వ్యవహారమంతా కేంద్ర ప్రభుత్వం చేతుల్లో పడింది.
Comments
Story first published: Tuesday, July 21, 2009, 15:54 [IST]