హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

చంద్రబాబును కలిశా: దేవేందర్

By Staff
|
Google Oneindia TeluguNews

Devender Goud
హైదరాబాద్: తాను తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడిని కలిసిన మాట వాస్తవమేనని ప్రజారాజ్యం పార్టీ నేత టి. దేవేందర్ గౌడ్ అంగీకరించారు. తమ పార్టీ ప్రధాన కార్యదర్శి అల్లు అరవింద్ తో సమావేశం ముగిసిన అనంతరం ఆయన బుధవారం మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. చంద్రబాబుతో గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై మాత్రమే మాట్లాడానని ఆయన చెప్పారు. అల్లు అరవింద్ తో నేడు జరిగిన భేటీకి ప్రత్యేకత ఏమీ లేదని, గ్రేటర్ హైదరాబాదులో అనుసరించాల్సిన వ్యూహంపై మాత్రమై మాట్లాడానని ఆయన చెప్పారు.

ప్రజారాజ్యం పార్టీని వీడిపోయే విషయంపై ఇప్పటి వరకు ఏ విధమైన నిర్ణయం తీసుకోలేదని ఆయన స్పష్టం చేశారు. తాను చిన్న పిల్లవాడిని కాదని, ఆలోచించి ఏదైనా నిర్ణయం తీసుకుంటానని ఆయన చెప్పారు. దేవేందర్ గౌడ్ ప్రజారాజ్యం పార్టీని వీడి తెలుగుదేశం పార్టీలో చేరే విషయం దాదాపుగా ఖరారైనట్లు చెబుతున్నారు. గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీతో కలిసి ప్రజారాజ్యం పని చేయాలని దేవేందర్ గౌడ్ సూచిస్తున్నారు. దీనికి ప్రజారాజ్యం అధినేత చిరంజీవి అంగీకరించడం లేదు. ఇదే కారణంపై దేవేందర్ గౌడ్ ప్రజారాజ్యం పార్టీకి రాజీనామా చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. మరో రెండు మూడు రోజులు ఆయన తెలుగుదేశం పార్టీలో చేరే విషయం వాయిదా పడినట్లు ప్రచారం జరుగుతోంది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X