మన్మోహన్ జవాబుపై వెంకయ్య ధ్వజం

నిత్యావసర సరుకుల ధరల పెరుగుదలపై పార్లమెంటు సమావేశాల అనంతరం దేశవ్యాప్తంగా ఆందోళనలు చేస్తామని ఆయన శుక్రవారం మీడియా ప్రతినిధులతో చెప్పారు. నిత్యావసర సరుకుల ధరలను నియంత్రించడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమయ్యాయని ఆయన విమర్శించారు. పొంతన లేని ప్రకటనలు చేస్తున్నారని ఆయన అన్నారు. ఉత్పత్తి, డిమాండ్ లను బట్టి ఏ సరుకు కూడా కొరత రాకుండా ముందస్తు చర్యలు తీసుకోవడంలో ప్రభుత్వాలు విఫలమయ్యాయని ఆయన అన్నారు. ఎన్నికల్లో ప్రజలకు చేసిన వాగ్దానాలను ప్రభుత్వం మరిచిపోయిందని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications