పూణే: స్వైన్ ఫ్లూ వ్యాధికి ఓ పాఠశాల విద్యార్థి బలయ్యాడు.బుధవారంనాడు మహారాష్ట్రలో ముగ్గురు మృత్యువాత పడ్డ కొన్ని గంటలకే పాఠశాల విద్యార్థి మరణించాడు. దీంతో స్వైన్ ఫ్లూతో దేశంలో సంభవించిన మరణాల సంఖ్య 15కు చేరుకుంది. మహారాష్ట్రలో స్వైన్ ఫ్లూ మృతుల సంఖ్య 11కు చేరింది. బాబూ గేను కులంద్ అనే బాలుడు బుధవారం ఉదయం 11 గంటల ప్రాంతంలో సస్సూన్ ఆస్పత్రిలో మరణించాడు. అతను పూణే సమీపంలోని పింప్రికి చెందినవాడు.