Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

ఖైదీల విడుదల జీవోపై స్టేకు నిరాకరణ

Supreme Court
న్యూఢిల్లీ: ఆగస్టు 15వ తేదీన స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఖైదీల విడుదలకు రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జీవో అమలుపై స్టే ఇచ్చేందుకు సుప్రీంకోర్టు బుధవారంనాడు నిరాకరించింది. ఆ జీవోపై దాఖలైన ప్రజా ప్రయోజనాన వ్యాజ్యం దాఖలైంది. ఈ వ్యాజ్యంపై సుప్రీంకోర్టు విచారణ చేపట్టింది. విచారణను సుప్రీంకోర్టు ఈ నెల 24వ తేదీకి వాయిదా వేసింది. తీవ్ర నేరారోపణలున్న ఖైదీలు ఆగస్టు 15వ తేదీన విడుదలైతే తిరిగి వారిని అరెస్టు చేయాల్సి ఉంటుందని కోర్టు స్పష్టం చేసింది.

ఆగస్టు 15వ తేదీన ఖైదీల విడుదలకు ప్రభుత్వం మార్గ దర్శక సూత్రాలను రూపొందించింది. ఈ మార్గ దర్శక సూత్రాల ప్రకారం తెలుగుదేశం పార్టీ మాజీ శాసనసభ్యుడు పరిటాల రవి హత్య కేసు నిందితుడు మద్దెలచెర్వు సూరి విడుదలయ్యే అవకాశాలున్నట్లు వార్తలు వస్తున్నాయి. అలాగే, కొంత మంది మావోయిస్టు ఖైదీలు కూడా విడుదల కావచ్చునని అంటున్నారు. ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టులో ప్రజాప్రయోజనాల వ్యాజ్యం దాఖలైంది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+