వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఎస్పీ ఆఫీసు వద్ద రజియా నిరశన

By Staff
|
Google Oneindia TeluguNews

Guntur
గుంటూరు: గుంటూరు జిల్లా ఎస్సై రంగనాథ్ గౌడ్ కేసులో తనకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ బాధితురాలు రజియా సుల్తానా శుక్రవారం ఎస్పీ కార్యాలయం ఎదుట నిరాహార దీక్షకు దిగింది. తనను పెళ్లి చేసుకుంటానని రంగనాథ్ మోసం చేశాడని ఆమె ఆరోపిస్తోంది. రంగనాథ్ తో తనకు పెళ్లి చేసే వరకు దీక్షను విరమించేది లేదని ఆమె చెబుతోంది. తన దీక్షను పోలీసులు భగ్నం చేయాలని చూస్తే ఆత్మహత్య చేసుకుంటానని బెదిరిస్తోంది.

రంగనాథ్ పై తాను ఫిర్యాదు చేసినా పోలీసులు పట్టించుకోలేదని ఆమె విమర్శించింది. పోలీసులు పట్టించుకోకపోవడం వల్లనే ఆందోళనకు దిగానని ఆమె చెప్పింది. ఆమెకు మద్దతుగా ప్రజారాజ్యం పార్టీ నేతలు, ఇతర మహిళా సంఘాల నేతలు ఆందోళనలో పాల్గొన్నారు. ముస్లిం మైనారిటీ సంస్థలు కూడా ఆందోళనకు దిగాయి.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X