రేప్: రాష్ట్రపతి బాడీగార్డులు దోషులు

హర్ ప్రీత్ సింగ్, సత్యేందర్ సింగ్, కుల్దీప్ సింగ్, మనీష్ కుమార్ లపై గ్యాంగ్ రేప్, అపహరణ, దోపిడీ యత్నం కింద కేసులు నమోదు చేశారు. బాధితురాలు 17 ఏళ్ల ఢిల్లీ విశ్వవిద్యాలయం విద్యార్థిని. రాష్ట్రపతి భవన్ కు సమీపంలోని పార్కుకు ఆమె 2003 అక్టోబర్ 6వ తేదీన బాయ్ ఫ్రెండ్ ఆశిష్ తో కలిసి షికారుకు వెళ్లింది. ఆ సమయంలో హర్ ప్రీత్ సింగ్, సత్యేందర్ ఆమెను రేప్ చేశారు. కుల్దీప్, మనీష్ కాపలా కాశారు. బాధితురాలి స్నేహితుడు ఆశిష్ తో పాటు ప్రాసిక్యూషన్ 25 మంది సాక్షులను విచారించింది.












Click it and Unblock the Notifications