వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అమెరికా దయగా ఉండాలి: షారూఖ్

By Staff
|
Google Oneindia TeluguNews

Shahrukh Khan
హూస్టన్: తనకు అమెరికాలో జరిగిన అవమానాన్ని ఇంతటితో ముగించాలని బాలీవుడ్ నటుడు షారూఖ్ ఖాన్ దేశంలోని అభిమానులకు సూచించారు. అమెరికా మరి కొంత దయగా, వేగంగా ప్రక్రియను సాగించడం అవసరమని ఆయన అభిప్రాయపడ్డారు. చికాగో నుంచి హూస్టన్ కు చేరుకున్న ఆయన మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమంలో పాల్గొన్నారు. అమెరికా పద్ధతిని తాను గౌరవించానని,దేశంలో లోపలికి వచ్చే విదేశీయుల పట్ల అమెరికా తన పద్ధతులను పాటించవచ్చునని, అయితే అది తనను ఇబ్బంది పెట్టిందని ఆయన అన్నారు.

సంఘటనపై దేశ ప్రజల ఆగ్రహాన్ని తాను అర్థం చేసుకోగలనని,అయితే దాన్ని ఇంతటితో ముగించడం మంచిదని ఆయన అన్నారు. మై నేమ్ ఈజ్ ఖాన్ చిత్రం ప్రమోషన్ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. జరిగిన సంఘటన వల్ల అమెరికా మరింత జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉందనే విషయాన్ని తాను గుర్తించానని ఆయన అన్నారు. అయితే విమానాశ్రయం భద్రతా సిబ్బంది తనను ప్రశ్నించిన తీరు బాగా లేదని ఆయన అభిప్రాయపడ్డారు. మీ పేరు కామన్ గా ఉందని చెప్పారని, దేనికి కామన్ అని తాను అడిగానని ఆయన చెప్పారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X