కరవుపై రాజకీయం వద్దు: బాబు

ప్రస్తుత కరవు పరిస్థితిలో అందరం ప్రజలకు బాసటగా నిలవాలని ఆయన సూచించారు. వాతావరణ పరిస్థితులను ఎవరూ నియంత్రించలేరని ఆయన అన్నారు. రైతుల రుణాలను మాఫీ చేయాలని పంట నష్టపోయిన రైతులకు బీమా వర్తింపజేయాలని ఆయన కోరారు. వ్యవసాయానికి పగటి పూట రోజుకు 9 గంటలు విద్యుత్ అందించాలని ఆయన డిమాండ్ చేశారు.
రైతులకు 95 శాతం సబ్సిడీతో ఎరువులు అందించాలని, నీటీ తీరువాను రద్దు చేయాలని ఆయన కోరారు. ప్రతి మండలానికి మంచి నీటి సరఫరా కోసం 50 లక్షల రూపాయలు కేటాయించాలని ఆయన కోరారు. విద్యార్థులకు ఇస్తున్న ఉపకార వేతనాలను పెంచాలని ఆయన కోరారు. డ్వాక్రా మహిళలకు రుణమాఫీ వర్తింపజేయాలని ఆయన డిమాండ్ చేశారు.












Click it and Unblock the Notifications