హైదరాబాద్: రాష్ట్రంలోని అన్ని ఆలయాల ఆస్తులపై విచారణ జరిపించాలని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. తిరుపతిలోని కోదండరామాలయంలోని శ్రీవారి నగలను అర్చకుడు తాకట్టు పెట్టిన ఘటనపై ఆయన శనివారం తీవ్రంగా ప్రతిస్పందించారు. ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లనే ఈ ఘటన చోటు చేసుకుందని ఆయన తప్పు పట్టారు.
రాష్ట్రంలో దేవుని సొమ్ములకే భద్రత లేకపోతే సామాన్యులకు ఏ విధమైన భద్రత ఉంటుందని ఆయన ప్రశ్నించారు. తిరుపతి ఘటనను ఆయన అత్యంత తీవ్రమైందిగా పరిగణించాలని ఆయన అన్నారు.