Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

గుజరాత్ లో పటేల్ వ్యతిరేక పుస్తకం

Jaswant Singh
అహ్మదాబాద్: సర్దార్ వల్లబ్ భాయ్ పటేల్ కు వ్యతిరేకంగా వ్యాఖ్యలున్నందుకు మాజీ కేంద్ర మంత్రి జస్వంత్ సింగ్ పుస్తకాన్ని నిషేధించిన నరేంద్ర మోడీ ప్రభుత్వం అటువంటి వ్యాఖ్యలే చేసిన మరో పుస్తకం గుజరాత్ లోని ఆర్ఎస్ఎస్ కార్యాలయంలోనే అమ్మకాని ఉండడాన్ని మాత్రం పట్టించుకోలేదు. ఆర్ఎస్ఎస్ సిద్ధాంతకర్తల్లో ఒకరైన హెచ్ వి శేషాద్రి ఈ పుస్తకాన్ని రాశారు. గత 27 ఏళ్లుగా ఆ పుస్తకం గుజరాత్ లో పంపిణీ అవుతోంది.

ఆ పుస్తకం గురించి ముఖ్యమంత్రి మోడీకి తెలియదనుకోవడం పొరపాటే. ఆర్ఎస్ఎస్ కార్యాలయానికి ఆయన తరుచూ వెళ్తుంటారు. 1967 నుంచి 1980 వరకు ఆయన ఆర్ఎస్ఎస్ ప్రచారక్ గా ఉన్నారు. పైగా ఆయనకు పుస్తక పఠన ప్రీతి కూడా ఎక్కువే. శేషాద్రి రాసిన పుస్తకం 1982 తర్వాతనే ప్రచురితమైనప్పటికీ ఆయనకు ఆ పుస్తకం గురించి తెలియదని అనుకోలేం.

ఆ పుస్తకం పేరు ది ట్రాజిక్ స్టోరీ ఆఫ్ పార్టిషన్. దేశ విభజనకు నెహ్రూ, పటేల్ కారణమని శేషాద్రి తన పుస్తకంలో రాశారు. అదే విషయాన్ని జస్వంత్ సింగ్ తన పుస్తకం జిన్నాః ఇండియా, ఇండిపెండెన్స్, పార్టీషన్ అనే పుస్తకంలో రాశారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+