వైయస్ ఆడుకుంటున్నారు: బాబు

Chandrababu Naidu
హైదరాబాద్: ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర రెడ్డికి శాసనసభ ఆటస్థలంగా మారిందని, తమ జీవితాలతో ఆడుకుంటున్నారని ప్రతిపక్ష నాయకుడు నారా చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు. శాసససభ శుక్రవారం ఉదయం ప్రారంభం కాగానే ఆయన తమ శాసనసభ్యుడు టీవీ రామారావు వ్యవహారాన్ని లేవనెత్తారు. గురువారం జరిగిన చర్చకు వివరణ ఇవ్వకుండానే సభాధ్యక్ష స్థానంలో ఉన్న ఉపసభాపతి నాదెండ్ల మనోహర్ అర్థాంతరంగా సభను వాయిదా వేశారని, ఆ అంశంపై చర్చించాలని చంద్రబాబు అన్నారు. అందుకు స్పీకర్ కిరణ్ కుమార్ రెడ్డి తిరస్కరించారు. ప్రశ్నోత్తరాల సమయం తర్వాత అర గంట సేపు రామారావు వ్యవహారంపై చర్చకు అనుమతిస్తానని స్పీకర్ హామీ ఇచ్చారు.

చంద్రబాబు వ్యాఖ్యలకు శాసనసభా వ్యవహారాల మంత్రి కె.రోశయ్య తీవ్రంగా ప్రతిస్పందించారు. వాయిదా తీర్మానాలు కూడా లేకుండానే చంద్రబాబు ఆ వ్యవహారాన్ని లేవనెత్తడమేమిటని ఆయన ప్రశ్నించారు. స్పీకర్ ను కించపరుస్తూ మాట్లాడే పార్టీ తెలుగుదేశం అని, ఆ పార్టీకి మాట్లాడే అర్హత లేదని ఆయన అన్నారు. ఆ తర్వాత ప్రశ్నోత్తరాల సమయం ప్రారంభమైంది. దీనికి ముందు ప్రతిపక్షాలు ప్రతిపాదించిన వాయిదా తీర్మానాలను స్పీకర్ తోసిపుచ్చారు. రాష్ట్రంలో మహిళలపై జరుగుతున్న అత్యాచారాలపై ప్రజారాజ్యం పార్టీ, కల్లుగీత కార్మికుల సమస్యలపై తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస), ఉద్యోగులకు పిఆర్సీ, ఉద్యోగుల క్రమబద్దీకరణపై బిజెపి వాయిదా తీర్మానాలను ప్రతిపాదించాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+