శ్రీవారికే భద్రతకే ముప్పు: బాబు

Chandrababu Naidu
హైదరాబాద్: తిరుమల శ్రీవెంకటేశ్వర స్వామి భద్రతనే ప్రశ్నార్థకంగా మారిందని ప్రతిపక్ష నాయకుడు నారా చంద్రబాబు నాయుడు అన్నారు. తిరుమల తిరుపతి దేవస్థానం (టిటిడి) వ్యవహారంపై సోమవారం శాసనసభలో చర్చ సందర్భంగా ఆయన ఆ వ్యాఖ్య చేశారు. భక్తుల విశ్వాసాన్ని దెబ్బ తీసే వ్యవహారాలు తిరుమలలో చేటుకున్నాయని ఆయన అన్నారు. టిటిడిలో లెక్కకు మంచి అవకతవకలు జరుగుతున్నా డాలర్ శేషాద్రిని ఇంకా ఎందుకు కొనసాగిస్తున్నారని తెలుగుదేశం సభ్యుడు అమర్నాథ్ రెడ్డి ప్రశ్నించారు. డాలర్ శేషాద్రి బ్లాక్ మెయిలింగ్ కు ప్రభుత్వం లొంగిపోతుందా అని ఆయన అడిగారు. ఒకప్పటి చైర్మన్ ప్రైవేట్ అతిథి గృహాలకు అవకాశం కల్పించడంలో నిమగ్నమయ్యారని, ఇప్పటి చైర్మన్ కార్పొరేట్ సంస్థల కొమ్ము కాయడానేక ప్రాధాన్యమిస్తున్నారని ఆయన అన్నారు. టిటిడి వ్యవహారాలపై శాసనసభా సంఘం వేయాలని తెలుగుదేశం డిమాండ్ చేసింది.

టిటిడి వ్యవహారాలపై సభా సంఘం వేయాలని ప్రతిపక్షాలన్నీ డిమాండ్ చేశాయి. టిటిడి వ్యవహారాల్లో రాజకీయ జోక్యం కూడదని సిపిఎం శాసనసభ్యుడు జూలకంటి రంగారెడ్డి కోరారు. టిటిడి పాలక మండలి చైర్మన్ గా రాజకీయ నాయకడిని నియమించవద్దని ఆయన అభిప్రాయపడ్డారు. ప్రస్తుత పాలకమండలిని రద్దు చేసి అవకతవకల విచారణకు సభా సంఘం వేయాలని ఆయన డిమాండ్ చేశారు. రాష్ట్రంలో హిందూ దేవాలయాల పవిత్రతను దెబ్బ తీసే విధంగా ప్రభుత్వం టిటిడి విషయంలో వ్యవహరిస్తోందని బిజెపి సభ్యుడు జి.కిషన్ రెడ్డి వ్యాఖ్యానించారు. ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర రెడ్డి హిందూ దేవాలయాల్లో అన్యమత ప్రచారాన్ని ప్రోత్సహిస్తున్నారని ఆయన విమర్శించారు. టిటిడి నిధులను ప్రభుత్వం ఇతర కార్యక్రమాలకు మళ్లిస్తోందని ఆయన అన్నారు. రాజకీయ నేతలకు దేవాలయ పాలక మండళ్లు పునరావాసంగా మారుతున్నాయని ఆయన అన్నారు. ఆదికేశవులు నాయుడు టిటిడి చైర్మన్ అయిన తర్వాత తిరుమల పవిత్రత పూర్తిగా దెబ్బ తిన్నదని ఆయన అన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+