టిటిడి అవినీతి మయం: చిరు

Chiranjeevi
హైదరాబాద్: తిరుమల తిరుపతి దేవస్థానం (టిటిడి)లో అవినీతి చోటు చేసుకోలేదని ప్రభుత్వం గుండె మీద చేయి వేసుకుని చెప్పగలదా అని ప్రజారాజ్యం పార్టీ అధ్యక్షుడు చిరంజీవి ప్రశ్నించారు టిటిడి నగలు తాకట్టు వ్యవహారంపై శాసనసభలో జరిగిన చర్చలో ఆయన సోమవారం పాల్గొన్నారు. తిరుమల కోదండ రామస్వామి ఆలయం స్వామివారి నగల తాకట్టు వ్యవహారం తీగ లాగితే టిటిడిలోని అవకతవకల డొంక కదులుతుందని ఆయన అన్నారు. అది నగల వ్యవహారమో, డబ్పుల వ్యవహారమో కాదని, కోట్లాది భక్తుల మనోభావాలనకు సంబంధించిన వ్యవహారమని ఆయన అన్నారు. స్వామి వారి ఊరేగింపులో భక్తులు వేసిన నాణేలు తగిలి వజ్రం పగిలిపోయిందని చెప్పడం హాస్యాస్పదంగా ఉందని ఆయన అన్నారు. దాదాపు 500 కోట్ల రూపాయల వ్యయంతో ఏర్పాటు చేసిన ఎస్వీ భక్తి ఛానెల్ భుక్తి ఛానెల్ గా మారిందని ఆయన వ్యాఖ్యానించారు. టిటిడి పాలక మండలిని వెంటనే ప్రక్షాళన చేయాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

తమకు జగన్నాథరావు కమిటీపై విశ్వాసం లేదని ఆయన చెప్పారు. ఆంజనేయరెడ్డి ఇచ్చిన కమిటీ నివేదిక ఏమైందని ఆయన అడిగారు. టిటిడి పాలకమండలిలో రాజకీయ జోక్యం తగదని ఆయన అన్నారు. తిరుపతి పట్టణాభివృద్ధి చైర్మన్ ను టిటిడి పాలకమండలిలో ఎక్స్ అఫిషియో సభ్యుడిగా వేయడాన్ని ఆయన వ్యతిరేకించారు. దళిత గోవిందం, కళ్యాణమస్తు కార్యక్రమాల్లో భారీ కుంభకోణాలు జరిగాయని ఆయన ఆరోపించారు. అన్నమయ్య జయంత్యుత్సవాల్లో 40 లక్షల రూపాయల మేరకు కుంభకోణం జరిగిందని ఆయన అన్నారు. టిటిడి వ్యవహారంపై విచారణకు సభా సంఘం వేయాలని, అదే సమయంలో సిబిఐ చేత విచారణ జరిపించాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+