టిటిడిపై ప్రతిపక్షాల వాకౌట్

Chandrababu Naidu
హైదరాబాద్: తిరుమల తిరుపతి దేవస్థానం (టిటిడి) వ్యవహారాలపై విచారణకు ప్రభుత్వం అంగీకరించకపోవడాన్ని నిరసిస్తూ ప్రతిపక్షాల సభ్యులు సోమవారం శాసససభ నుంచి వాకౌట్ చేశాయి. తెలుగుదేశం, ప్రజారాజ్యం, వామపక్షాలు, తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస), బిజెపి సభ్యులు సభ నుంచి వాకౌట్ చేశాయి. ప్రతిపక్షాలు చేసిన విమర్శకు దేవాదాయ శాఖ మంత్రి గాదె వెంకట రెడ్డి సమాధానమిస్తూ సభా సంఘం ఏర్పాటు వల్ల ప్రయోజనాలు లేవని, అందువల్ల ప్రభుత్వం సభా సంఘం వేయడానికి సిద్ధంగా లేదని ఆయన చెప్పారు. జగన్నాధరావు కమిటీ విచారణ జరుగుతోందని, శాఖాపరమైన విచారణ కూడా జరుగుతోందని ఆయన చెప్పారు. ప్రభుత్వం ఎవరినీ రక్షించడానికి ప్రయత్నించడం లేదని ఆయన స్పష్టం చేశారు.

రాష్ట్రంలోని దేవాలయాల ఆస్తుల రక్షణకు ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆయన చెప్పారు. తిరుపతిలోని ఒక్క కోదండ రామస్వామి ఆలయం నగలను తాకట్టు పెడితే దాన్ని టిటిడి మొత్తానికి ఆపాదించడం మంచిది కాదని ఆయన అన్నారు. టిటిడి పాలక మండలిని రద్దు చేయాల్సిన అవసరం లేదని ఆయన అన్నారు. కలియుగ దైవమైన వేంకటేశ్వర స్వామి మీద భక్తి తగ్గించే విధంగా సభ్యులు వ్యాఖ్యలు చేయడం సరి కాదని అన్నారు. దానిపై ప్రభుత్వ వైఫల్యం ఏమీ లేదని, తాము పారదర్శకంగా వ్యవహరిస్తున్నామని మంత్రి చెప్పారు. వ్యవహారాన్ని రాజకీయం చేయవద్దని ఆయన సూచించారు. దేవాలయాలకు చెందిన నగలు, స్థలాలు, పొలాలు, ఇతర ఆస్తుల వివరాలు అన్నింటినీ వైబ్ సైట్ లో ఉంచుతామని ఆయన అన్నారు. అక్టోబర్ 2వ తేదీన వెబ్ సైట్ ను ప్రారంభిస్తున్నట్లు ఆయన తెలిపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+