రాజకీయ విమర్సలు వద్దు: బాబు

YS Rajasekhar Reddy
హైదరాబాద్: తిరుమల తిరుపతి దేవస్థానం (టిటిడి) వ్యవహారంలో రాజకీయ విమర్శలు వద్దని ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర రెడ్డి ప్రతిపక్షాలు సూచించారు. టిటిడి అక్రమాలపై సభా సంఘానికి దేవాదాయ శాఖ మంత్రి గాదె వెంకటరెడ్డి తిరస్కరించిన తర్వాత ఆయన శాసనసభలో వివరణ ఇచ్చారు. తిరుమల హిందూ భక్తుల మనోభావాలకు సంబంధించిన వ్యవహారమని, హిందువుల మనోభావాలు దెబ్బ తినకుండా చూస్తున్నామని ముఖ్యమంత్రి చెప్పారు. చిన్నపాటి లోపాలుంటే సవరించడానికి సూచనలు ఇవ్వాలని ఆయన ప్రతిపక్షాలను కోరారు. తిరుమలలో డాలర్ల అదృశ్యం ఆరోపణలపై జగన్నాధరావు కమిటీ విచారణ జరిపిందని, మరో వైపు హైకోర్టులో కేసు నడుస్తోందని ఆయన చెప్పారు.

కోదండరామస్వామి ఆలయంలో శ్రీవారి నగలను పూజారి తాకట్టు పెట్టిన వ్యవహారంపై తమ దృష్టికి రాగానే వెంటనే చర్యలు చేపట్టామని, ప్రభుత్వం కచ్చితంగా, సమర్థంగా వ్యవహరించిందని ఆయన చెప్పారు. నగలను కుదవ పెట్టిన పూజారినే కాకుండా కుదువ పెట్టుకున్నవారిని కూడా అదుపులోకి తీసుకున్నామని ఆయన చెప్పారు. భక్తులు వేంకటేశ్వరస్వామిపై భక్తితో కోట్లాది రూపాయలు సమర్పిస్తున్నారని, అవి దుర్వినియోగం కాకుండా చూస్తున్నామని ఆయన చెప్పారు. దేశంలోని అన్ని ఆలయాల్లో కన్నా తిరుమలలోనే సౌకర్యాలు బాగా ఉన్నాయని, రోజుకు 70-80 వేల మంది భక్తులు వస్తారని, వారందరికీ సౌకర్యాలు కల్పించడం చిన్న విషయమేమీ కాదని, కానీ ఆ విషయంలో తిరుమల తిరుపతి దేవస్థానం సమర్థంగా వ్యవహరిస్తోందని ఆయన అన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+