హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

అంత్యక్రియలకు ట్రాఫిక్ బ్రేక్

By Staff
|
Google Oneindia TeluguNews

Chandrababu Naidu
హైదరాబాద్‌: ఇడుపులపాయ వద్ద పదిహేను కిలోమీటర్ల పొడవునా ట్రాఫిక్ స్తంభించడంతో చాలా మంది ప్రముఖులు వైఎస్‌ అంత్యక్రియలకు హాజరుకాలేకపోయారు. చ్రందబాబు, చిరంజీవి, సురవరం, నారాయణ, కేంద్రమంత్రి పల్లం రాజు, విజయ శాంతి, నామా నాగేశ్వరరావు, మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, గీతారెడ్డి, గల్లా ఆరుణకుమారి, కొండా సురేఖ, బొత్సా సత్యనారాయణ, వట్టి వసంతకుమార్‌, పొన్నాల లక్ష్మయ్య, ఆనం రాంనారాయణ రెడ్డి, శిల్పామోహన్‌ రెడ్డి, శ్రీధర్‌బాబు, పితాని చంద్రశేఖర్‌, మాణిక్యవరప్రసాద్‌, మోపిదేవి, విశ్వరూప్‌లు వైఎస్‌ అంత్యక్రియలకు హాజరు కాలేక పోయారు.

ఎర్రబెల్లి, బొజ్జల, రామచంద్రయ్య, లోకసత్తా నేత శ్రీనివాస్‌లతో పాటు 25 మంది కాంగ్రెసై ఎంపీలు సైతం అంత్యక్రియలకు అందలేక పోయారు. అంత్యక్రియలు ముగిసిన తర్వాత నేతలు ఇడుపులపాయ చేరుకున్నారు. తిరుగు ప్రయాణంలో వీరంతా ఓ చర్చిలో ప్రార్థనలు చేశారు. వీరంతా అంత్యక్రియల్లో పాల్గొనేందుకు హైదరాబాదు నుంచి తిరుపతకి ప్రత్యేక విమానంలో బయలు దేరారు. రేణిగుంట విమానాశ్రయం నుంచి 4 బస్సుల్లో ఇడుపులపాయ బయలుదేరారు. ఇడుపులపాయ సమీపానికి చేరుకునేలోపు విపరీతమైన ట్రాఫిక్‌తో రోడ్లు జమయ్యాయి. దీంతో నేతలంతా ట్రాఫిక్‌లోనే చిక్కుకుపోయి వైఎస్‌ అంత్యక్రియలకు అందలేకపోయారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X