డిజిపికి హెలికాప్టరా? బాబు మండిపాటు

దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి అంత్యక్రియలకు హాజరుకావడానికి హైదరాబాద్ నుంచి ప్రత్యేక విమానంలో వందమందికి పైగా ఎమ్మెల్యేలు, ఎంపీలు, మాజీ మంత్రులతో పాటు ప్రతిపక్ష నాయకులైన చంద్రబాబు, చిరంజీవి ప్రత్యేక విమానంలో రేణిగుంట వచ్చారు. తర్వాత అధికారులు ఏర్పాటు చేసిన వాహనాల్లో ఇడుపులపాయకు బయలుదేరారు.
అయితే కడప దాటిన తరువాత రోడ్డుకు అడ్డంగా వాహనాలు పెద్ద సంఖ్యలో ఉండటంతో రెండు గంటలు నిరీక్షించి తిరుగుముఖం పట్టారు. రాత్రి 10.30కి తిరుపతి విమానాశ్రయం చేరుకున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్, ఎస్పీలపై చంద్రబాబు విరుచుకుపడ్డారు.
"ముఖ్యమంత్రి అంతిమ సంస్కారాలకు హాజరుకావాలని వందల మంది ఎమ్మెల్యేలు, మంత్రులు, ప్రతిపక్ష నాయకులు వస్తే కనీసం ఆయన భౌతికకాయం వద్దకు కూడా మమ్మల్ని తీసుకెళ్లలేక పోయారు. ఏం చేస్తున్నారు మీరు..!" అంటూ చంద్రబాబు నిలదీశారు.
More From
-
రైతులకు శుభవార్త.. రైతు భరోసాపై కీలక ప్రకటన చేసిన మంత్రి! -
భారత్పై అమెరికా దర్యాప్తు. సెక్షన్ 301 ప్రయోగించిన ట్రంప్ -
హైదరాబాద్ లో మరో అద్దిరిపోయే రైల్వే స్టేషన్ -
భారత్ బిగ్ టర్న్: షాక్ ఇచ్చిన చైనా, రష్యా ఐరాస వేదికగా హైడ్రామా -
విద్యార్థులకు శుభవార్త.. ఒంటిపూట బడులపై విద్యాశాఖ ప్రకటన, ఎప్పటినుండి అంటే -
కుప్పకూలిపోయిన గ్యాస్ బుకింగ్ సిస్టమ్! ఇలా చేస్తేనే గ్యాస్ బుకింగ్ -
సాగర్ మీదుగా హైదరాబాద్ టు విజయవాడ ఎక్స్ ప్రెస్ వే -
విజయవాడ- నిడదవోలు రైల్వే రూట్ లో ఇకపై.. !! -
యుద్ధం ముగింపుకు ఇరాన్ 3 షరతులు-భారత్ పై ప్రభావం ఇదే ? -
లాక్ డౌన్ లోకి పాకిస్థాన్.. ఇప్పట్లో బయట పడడం కష్టమే..!! -
గ్రీన్ఫీల్డ్ జాతీయ రహదారి బెంగళూరు-కడప-విజయవాడపై ఏపీ సీఎం చంద్రబాబు కీలక ప్రకటన -
కుప్పకూలిపోతున్న బంగారం ధరలు.. !!












Click it and Unblock the Notifications