రోశయ్యకు సహాయ నిరాకరణ

రోశయ్య 34 మంది మంత్రులతో ఆదివారంనాడు ప్రమాణ స్వీకారం చేశారు. అయిష్టంగా మంత్రులుగా ప్రమాణం చేసినవారు తాము వైయస్ జగన్ నాయకత్వంలో తప్ప మరొకరి నాయకత్వంలో పని చేయబోమని కచ్చితమైన సందేశాన్ని ఇస్తున్నారు. పెరుగుతున్న నిత్యావసర సరుకుల ధరలపై జరిగిన సమీక్షా సమావేశానికి బుధవారం సంబంధిత మంత్రి జూపల్లి కృష్ణారావు డుమ్మా కొట్టారు. పౌర సరఫరాల కమిషనర్ సంజయ్ జాజూ కూడా హాజరు కాలేదు.
కరువు పరిస్థితిపై రోశయ్య సోమవారం సమీక్షా సమావేశానికి వ్యవసాయ శాఖ మంత్రి ఎన్ రఘువీరా రెడ్డి దూరంగా ఉన్నారు. ఆ తర్వాతి రోజు మంగళవారం స్వైన్ ఫ్లూపై జరిగిన సమీక్షా సమావేశానికి ఆరోగ్య శాఖ మంత్రి డి. నాగేందర్ ఆలస్యంగా వచ్చారు. అంతే కాకుండా సమావేశం ముగియకుండానే వెళ్లిపోయారు. ఇదంతా రోశయ్యకు తీవ్రంగా మనస్తాపానికి గురి చేస్తున్నట్లు తెలుస్తోంది.












Click it and Unblock the Notifications