భయంతో జయప్రద కేకలు

Jayaprada
లక్నో: తెలుగు సినిమా నటి, ఉత్తరప్రదేశ్ లోని రాంపూర్ లోకసభ సభ్యురాలు జయప్రద సోమవారం భయంతో కేకలు వేశారు. ఆమె సోమవారం తన నియోజకవర్గంలోని రాంపూర్ లో వరద బాధితులను పరామర్శించడానికి బయలు దేరారు. వరదలు విపరీతంగా ఉండడంతో ఆమె రోడ్డు మార్గంలో ప్రయాణించలేకపోయారు. పడవలో ప్రయాణం చేయాల్సి వచ్చింది. అయితే పడవ ఒక్కసారిగా కుదుపునకు గురైంది. దీంతో భయానికి జయప్రద కంపించిపోయింది. భయంతో తట్టుకోలేక బిగ్గరగా కేకలు పెట్టింది.

ఎట్టకేలకు వరద బాధితుల చెంతకు చేరుకున్న ఆమె వారిని పరామర్శించారు. వరద బాధితులకు సహాయం అందించడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమయ్యాయని ఆమె విమర్సించారు. ఉత్తరప్రదేశ్ లో భారీ వర్షాలకు పలు ప్రాంతాలు అతలాకుతలమయ్యాయి. ఆదివారంనాటికి వరదల తాకిడికి 16 మంది మరణించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+