దేశ భద్రతకు నక్సల్స్ ముప్పు: పిఎం

Manmohan Singh
న్యూఢిల్లీ: దేశ అంతర్గత భద్రతకు వామపక్ష తీవ్రవాదం నుంచి తీవ్రమైన ముప్పు ఉందని ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ ఆందోళన వ్యక్తం చేశారు. ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ నక్సలైట్ హింసకు అరికట్టడంలో తగిన ఫలితాలు సాధించలేకపోయామని ఆయన అన్నారు. తాము ఎదుర్కుంటున్న ప్రమాదాల్లో వామపక్ష తీవ్రవాదం అత్యంత ప్రమాదకరమైందని తాను ఎప్పుడూ చెబుతూనే ఉన్నానని ఆయన అన్నారు. ప్రయత్నాలు సాగుతున్నప్పటికీ నక్సల్ ప్రభావితం రాష్ట్రాల్లో హింస పెరుగుతోందని ఆయన అన్నారు. రాష్ట్రాల పోలీసు చీఫ్ ల సమావేశంలో ఆయన రెండో రోజు మంగళవారం ప్రసంగించారు.

నక్సల్స్ సమస్యను కేవలం శాంతిభద్రతల సమస్యగానే చూడకూడదని, ప్రయత్నాలు ఎన్ని జరిగినప్పటికీ నక్సల్స్ కు గిరిజనుల నుంచి, నిరుపేదల నుంచి మద్దతు లభిస్తోందని ఆయన అన్నారు. నక్సల్స్ ప్రభావం పౌర సమాజంలోని కొన్ని వర్గాలు, మేధావి వర్గం, యువతలో ఉందని, ఇదంతా సమస్య సంక్లిష్టతకు దారి తీస్తోందని ఆయన అన్నారు. ఈ విషయాలను దృష్టిలో ఉంచుకుని సమస్య పరిష్కారానికి కృషి చేయాలని ఆయన సూచించారు.

ఈశాన్య రాష్ట్రాల్లో అస్సాం, మణిపూర్ ల్లో హింస ఆక్షేపణీయ స్థాయిలో ఉందని ఆయన అన్నారు. ఈశాన్య ప్రాంతంలో బలవంతపు వసూళ్లు జరుగుతున్నాయని ఆయన అన్నారు. మొత్తంగా ఈశాన్య రాష్ట్రాల్లో శాంతిభద్రతల పరిస్థితి కాస్తా మెరుగు పడిందని ఆయన అభిప్రాయపడ్డారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+