హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

రోశయ్య ముందుకెళ్తారు: డిఎస్

By Staff
|
Google Oneindia TeluguNews

Srinivas
హైదరాబాద్: దివంగత నేత వైయస్ రాజశేఖర రెడ్డి తలపెట్టిన పథకాలను ముఖ్యమంత్రి రోశయ్య సమర్థంగా అమలు చేస్తారని ఆశిస్తున్నట్లు ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ (పిసిసి) అధ్యక్షుడు డి. శ్రీనివాస్ అన్నారు. తెలంగాణ విమోచన దినోత్సవం సందర్భంగా ఆయన గురువారం పార్టీ కార్యాలయం గాంధీ భవన్ లో జాతీయ పతాకను ఆవిష్కరించి ప్రసంగించారు. వైయస్ నాయకత్వంలో మాదిరిగానే రోశయ్య నేతృత్వంలో కూడా అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందుతాయని భావిస్తున్నట్లు ఆయన తెలిపారు.

వైయస్ రాజశేఖర రెడ్డి అకాల మరణంతో తెలంగాణ స్వాతంత్ర్య దినోత్సవాలను నిరాడంబరంగా జరుపుతున్నట్లు ఆయన చెప్పారు. వైయస్ లేకుండా ఈ వేడుకలను జరపడం బాధాకరమని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి రోశయ్యతో పాటు రాజ్యసభ సభ్యుడు కెవిపి రామచందర్ రావు కూడా పాల్గొన్నారు. అంతకు ముందు హైదరాబాదులోని పోలీసు కంట్రోల్ రూం ఎదురుగా ఉన్న సర్దార్ పటేల్ విగ్రహానికి డి. శ్రీనివాస్, కెవిపి పూలమాలలు వేసి శ్రద్ధాంజలి ఘటించారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X