జగన్ పై ఏమీ చెప్పను: కెకె
ముఖ్యమంత్రి అభ్యర్థి ఎంపిక విషయంలో పార్టీ అధిష్ఠాన వర్గం ప్రజాభిప్రాయాన్ని పరిగణనలోకి తీసుకుంటుందని ఆయన చెప్పారు. అధిష్ఠాన వర్గం నియంతలాగా వ్యవహరించబోదని ఆయన చెప్పారు. రాష్ట్ర, జాతీయ ప్రయోజనాలను, పార్టీ ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని వ్యవహరిస్తుందని ఆయన అభిప్రాయపడ్డారు. తాను హైదరాబాదుకు ముఖ్యమంత్రి ఎంపిక విషయంలో మంతనాలు జరపడానికి రాలేదని, మామూలుగానే వచ్చానని, అలా వచ్చినప్పుడు మిత్రులను కలుసుకోకుండా ఉండలేనని ఆయన అన్నారు. పార్టీ కలిసికట్టుగా ఉందని, కలిసికట్టుగా ఉంటుందని ఆయన అన్నారు. టీవీ చానెళ్ల వల్ల సమస్య తలెత్తుతోందని ఆయన అన్నారు. రాష్ట్ర రాజకీయాల గురించి తాను నాయకులతో మాట్లాడలేదని ఆయన అన్నారు. రాష్ట్రంలోని ప్రతి పరిణామాన్ని అధిష్ఠానం జాగ్రత్తగా గమనిస్తోందని ఆయన అన్నారు. ముఖ్యమంత్రి రోశయ్యతో తాను రాష్ట్ర రాజకీయాల గురించి చర్చించలేదని ఆయన అన్నారు.