వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పావురాలగుట్టకు వైయస్ జగన్

By Sridhar L
|
Google Oneindia TeluguNews

YS Jagan
కర్నూలు: దివంగత నేత వైయస్ రాజశేఖర రెడ్డి తనయుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి శుక్రవారం ఉదయం పావురాలగుట్టకు బయలుదేరారు. తన తండ్రి మృతి చెందిన ప్రాంతాన్ని ఆయన సందర్శించి నివాళులర్పిస్తారు. ఆయన ఇడుపులపాయలో వైయస్ రాజశేఖర రెడ్డి సమాధి వద్ద నివాళులు అర్పించి పావురాలగుట్టకు బయలుదేరారు. ఆయన హెలికాప్టర్ లో నల్లకాలువకు చేరుకుని అనంతరం పావురాలగుట్టకు చేరుకుంటారు. అది నక్సల్స్ ప్రభావిత ప్రాంతం కావడంతో భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు. పావురాలగుట్ట వద్ద సర్వమత ప్రార్థనలు జరిగిన అనంతరం తిరిగి నల్లకాలువ ప్రాంతానికి చేరుకుంటారు.

నల్లకాలువ వద్ద వైయస్ మృతికి భారీ యెత్తున బహిరంగ సభకు ఏర్పాట్లు చేశారు. ఈ సభలో వైయస్ జగన్ ప్రసంగిస్తారు. ఈ సభకు పెద్ద యెత్తున అభిమానులు తరలివస్తున్నారు. మంత్రులు, శాసనసభ్యులు కూడా అక్కడికి చేరుకున్నారు. వైయస్ జగన్ కు స్వాగతం చెప్పేందుకు ప్రజారాజ్యం పార్టీ నేతలు భూమా నాగిరెడ్డి, శోభానాగిరెడ్డి దంపతులు హెలీపాడ్ వద్దకు చేరుకున్నారు. జగన్ తమకు ఏదైనా రాజకీయ సందేశం ఇస్తారనే ఉద్దేశంతో నాయకులు, అభిమానులు ఉన్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X