వరద బీభత్సానికి నాగులదిన్నెలో 45 మంది గల్లంతు

Floods
హైదరాబాద్: వరద బీభత్సానికి కర్నూలు, మహబూబ్ నగర్ జిల్లా పరిస్థితి అస్తవ్యస్తంగా మారింది. లక్షలాది మంది ప్రాణాలు అరచేతిలో పట్టుకుని సాయం కోసం ఎదురు చూస్తున్నారు. గ్రామాలకు గ్రామాలు వరదల్లో చిక్కుకున్నాయి. శ్రీశైలం ప్రాంతానికి రాకపోకలు స్తంభించాయి. రహదారులు తీవ్రంగా దెబ్బ తిన్నాయి. కర్నూలు జిల్లాలోని నాగులదిన్నెలో 45 మంది గల్లంతయ్యారు. జూరాల ప్రాజెక్టు నుంచి 9 లక్షల క్యూసెక్కుల నీరు విడుదల చేశారు. మహబూబ్ నగర్ జిల్లాలోని ఐజ మండలంలోని ఉప్పల్ గ్రామంలో రెండు చెరువులకు గండ్లు పడ్డాయి. దీంతో కింది గ్రామాల ప్రజలను అధికారులు ఖాళీ చేయిస్తున్నారు.

పోతిరెడ్డిపాడు ప్రాజెక్టు గేట్లు తెరుచుకోవడం లేదు. దీంతో పరిస్థితి ప్రమాదకరంగా పరిణమించింది. ఎస్ఆర్ఎం కాలువకు గండి పడింది. కర్నూలు, మహబూబ్ నగర్ జిల్లాలకు 120 సైనిక బలగాలను పంపాలని రాష్ట్ర ప్రభుత్వం కేంద్రాన్ని కోరింది. కర్నూలు జిల్లాకు 4 హెలికాప్టర్లు, మహబూబ్ నగర్ జిల్లాకు రెండు హెలికాప్టర్లు పంపారు. రెండు జిల్లాలకు కలిపి ఆరు పవర్ బోట్లను కూడా నియోగించారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు ఎగువ ప్రాంతాలకు తరలిపోతున్నారు. హెలికాప్టర్ల ద్వారా ప్రజలను సురక్షితంగా తరలిస్తామని వ్యవసాయ శాఖ మంత్రి రఘువీరా రెడ్డి చెప్పారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+