40 లంక గ్రామాలకు ముంపు భయం

Vijayawada
విజయవాడ: కృష్ణా జిల్లాలోని 40 లంక గ్రామాలకు వరద ముప్పు పొంచి ఉంది. కృష్ణా నదికి వరద ఉధృతి పెరుగుతుండడంతో కృష్ణా జిల్లాలోని లోతట్టు ప్రాంతాలకు, విజయవాడలోని పలు కాలనీలకు వరద ముప్పు పొంచి ఉంది. విజయవాడలోని లోతట్టు ప్రాంతాలు ఇప్పటికే జలమయమయ్యాయి. కృష్ణా జిల్లాలోని 40 లంక గ్రామాల ప్రజలను అధికారులు బలవంతంగా సురక్షిత ప్రాంతాలకు తరలించే ప్రయత్నం చేస్తున్నారు.

చెన్నై - విజయవాడ మధ్య రైళ్లు ఆగిపోయే పరిస్థితి ఉంది. దివిసీమకు సముద్రం పోటు భయం పొంచి ఉంది. పలు గ్రామాలు జలమయ్యాయి. విజయవాడ రూరల్, అర్బన్ మండలాలతో పాటు ఇతర గ్రామాలు కూడా ప్రాణభయంతో గింజుకుంటున్నాయి. దాదాపు 70 గ్రామాల ప్రజలను ఇతర ప్రాంతాలకు తరలించే ప్రయత్నం చేస్తున్నారు. అయితే ప్రజలు అందుకు మొరాయిస్తున్నారు. వారిని బయటకు రప్పించేందుకు విద్యుత్ సరఫరా ఆపించారు. మంత్రి బొత్సా సత్యనారాయణ ప్రజలను నచ్చజెప్పే ప్రయత్నం చేస్తున్నారు. కృష్ణా నదికి 4 లక్షల 30 వేల క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతోంది. శ్రీశైలం వద్ద వరద ఉధృతి తగ్గడం లేదు. ఆనకట్ట పై నుంచి నీరు ప్రవహించే పరిస్థితి ఉంది. దీంతో కృష్ణా బ్యారేజీకి ఇంకా నీరు చేరే ప్రమాదం ఉంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+