హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఆలంపూర్ లో ఏడు మృతదేహాలు

By Pratap
|
Google Oneindia TeluguNews

Alampur
మహబూబ్ నగర్: మహబూబ్ నగర్ జిల్లాలోని ఆలంపూర్ లో బుధవారంనాటికి ఏడు మృతదేహాలు బయటపడ్డాయి. వరద నుంచి మహబూబ్ నగర్ జిల్లా ఇప్పుడిప్పుడే తేరుకుంటోంది. వరద తగ్గుతుండడంతో మృతదేహాలు బయటపడుతున్నాయి. ఆలంపూర్ పూర్తిగా నీటిలో మునిగింది. ప్రస్తుతం తగ్గుముఖం పడుతుండడంతో మృతదేహాలు బయట పడుతున్నాయి. మరిన్ని మృతదేహాలు బయట పడే అవకాశాలున్నట్లు అనుమానిస్తున్నారు.

ఆలంపూర్ లో పూర్తిగా నీరు తగ్గేందుకు కనీసం నాలుగైదు రోజులు పట్టవచ్చునని భావిస్తున్నారు. మహబూబ్ నగర్ జిల్లాలోని ఆరు గ్రామాలు ఇంకా నీటిలోనే ఉన్నాయి. వీపనగండ్ల, పెబ్బేరు మండలాల్లోని గ్రామాల చుట్టూ నీరు చేరి ఉంది. గద్వాల డివిజన్ కూలిన ఇళ్లను తొలగించే పని ప్రారంభం కాలేదు. ఇళ్లలోని ఒండ్రుమట్టిని ఎవరికి వారే తొలగించుకుంటున్నారు. కర్నూలు, హైదరాబాద్ రహదారిని పునరుద్ధరించారు. జిల్లాలో చాలా వరకు నీరు తగ్గినా ఒండ్రు మేటలు వేయడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X