వరద మృతులు 63 మంది

AP Floods
హైదరాబాద్: రాష్ట్రాన్ని కుదిపేసిన వరదలు 63 మందిని బలి తీసుకున్నాయి. ఈ విషయాన్ని రాష్ట్ర రెవెన్యూ మంత్రి ధర్మాన ప్రసాదరావు మంగళవారం మీడియా ప్రతినిధుల సమావేశంలో వెల్లడించారు. కర్నూలు జిల్లాలోనే 38 మంది మరణించినట్లు ఆయన తెలిపారు. నంద్యాల, ఆదోనీల్లో ట్యాంకర్ల ద్వారా మంచినీరు సరఫరా చేస్తున్నట్లు ఆయన తెలిపారు. కర్నూలులో 40 ప్రత్యేక కౌంటర్ల ద్వారా బియ్యం సరఫరా చేస్తున్నట్లు ఆయన చెప్పారు. కర్నూలు, మహబూబ్ నగర్ జిల్లాల్లో పారిశుద్థ్యానికి గ్రేటర్ హైదరాబాదులో శిక్షణ పొందిన 450 మందిని పంపినట్లు ఆయన చెప్పారు. వరద తాకిడికి మహబూబ్ నగర్ జిల్లాలో 20 మంది, నల్లగొండ జిల్లాలో ముగ్గురు, కృష్ణా జిల్లాలో ఒకరు, గుంటూరు జిల్లాలో ఒకరు మరణించినట్లు ఆయన వివరించారు.

కర్నూలు, మహబూబ్ నగర్ జిల్లాల్లో ప్రధాన రోడ్లపై బురదను తొలగించేందుకు ప్రత్యేక డ్రైవ్ ను చేపట్టినట్లు మంత్రి చెప్పారు. బుధవారం నుంచి మారుమూల ప్రాంతాల్లో కూడా పనులు ప్రారంభిస్తామని ఆయన చెప్పారు. వరద బాధితుల సంఖ్య 3.59 లక్షలు ఉందని, మొత్తం 565 గ్రామాలు నీట మునిగాయని, 16.2 లక్షల మంది నిరాశ్రయులయ్యారని ఆయన వివరించారు. మొత్తం 62,286 ఇళ్లు ధ్వంసమైనట్లు ఆయన తెలిపారు. 19,862 పశువులు మరణించినట్లు చెప్పారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+