గుంటూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఇంకా నీటిలోనే రేపల్లే పట్టణం

By Pratap
|
Google Oneindia TeluguNews

Repalle
గుంటూరు: గుంటూరు జిల్లాలోని రేపల్లె పట్టణం ఇంకా నీటిలోనే మునిగి ఉంది. అయితే గురువారం ఉదయానికి ఒక అడుగు మేర నీరు తగ్గింది. కానీ ప్రజలు బయటకు వచ్చే పరిస్థితి లేదు. పాల ప్యాకెట్ల కోసం, నిత్యావసర సరుకుల కోసం ప్రజలు అల్లాడుతున్నారు. పల్లెపాలెం వద్ద కరకట్టకు గండి పడడంతో పెద్ద యెత్తున రేపల్లే, దాని పరిసర గ్రామాల్లోకి వరద నీరు ఉధృతంగా ప్రవహించింది. పట్టణం పరిసరాల్లోని గ్రామాల్లో ఇఁకా వరద నీరు ప్రవహిస్తూనే ఉన్నది. పంటలన్నీ కొట్టుకుపోయాయి.

రేపల్లె, తెనాలిల మధ్య రైళ్ల రాకపోకలు నిలిచిపోయాయి. రేపల్లె సబ్ జైలులోకి పెద్ద యెత్తున నీరు వచ్చి చేరింది. దీంతో జైలులోని 40 మంది ఖైదీలను వేరే చోటికి తరలించారు. పల్లె పాలెం గండి పూడ్చేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు. ఈ గండిని పూడ్చివేస్తే తప్ప రేపల్లె, దాని పరిసర గ్రామాలు నీటి ప్రమాదం నుంచి బయటపడలేవు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X