వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

నక్స్లల్స్ చేతిలో 17 మంది పోలీసులు బలి

By Pratap
|
Google Oneindia TeluguNews

Naxalites
ముంబై: మహారాష్ట్రలోని గడ్చిరోలీ జిల్లాలో గురువారం నక్సలైట్లకు, పోలీసులకు మధ్య భారీ ఎదురుకాల్పులు చోటు చేసుకున్నాయి. ఇరు పక్షాల మధ్య దాదాపు 4 గంటల పాటు హోరాహోరీ పోరు జరిగింది. ఇందులో నక్సలైట్ల చేతిలో 17 మంది పోలీసులు బలయ్యారు. పోలీసుల చేతిలో 15 మంది నక్సలైట్లు హతమయ్యారు. గడ్చిరోలీ జిల్లాలోని లహరి గ్రామ అటవీ ప్రాంతంలో పోలీసులపైకి నక్సలైట్లు ఒక్కసారిగా విరుచుకుపడ్డారు. గాలింపు కోసం వెళ్లిన పోలీసులను నిశితంగా గమనిస్తూ వచ్చిన నక్సలైట్లు అదును చూసి దాడి చేశారు.

మరణించిన పోలీసుల్లో 10 మంది యాంటీ నక్సలైట్ స్క్వాడ్ కు చెందినవారు కాగా, పది మంది స్థానిక పోలీసులు ఉన్నారు. కాల్పులు జరిగిన ప్రాంతానికి హుటాహుటిన చేరుకున్న బిఎస్ఎఫ్ బలగాలు 28 మంది పోలీసులను కాపాడాయి. మృతుల్లో యాంటీ నక్సలైట్ స్క్వాడ్ కు నాయకత్వం వహించిన రామా ఖుయానీ ఉన్నాడు. అలాగే సబ్ ఇన్ స్పెక్టర్ చంద్రశేఖర్ దేశ్ ముఖ్ కూడా నక్సల్స్ దాడిలో మరణించారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X