నిధులపై ప్రభుత్వం మొహమాటం: చిరు

Chiranjeevi
గుంటూరు: వరద సాయానికి కేంద్ర ప్రభుత్వాన్ని నిధులు అడగడానికి రాష్ట్ర ప్రభుత్వం మొహమాట పడుతోందని ప్రజారాజ్యం పార్టీ అధ్యక్షుడు చిరంజీవి విమర్శించారు. వరద తాకిడి ప్రాంతాల్లోని బాధితులను పరామర్శించడానికి వచ్చిన చిరంజీవి తెనాలిలో మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. వరద సాయానికి రేంద్ర నుంచి నిధులు రాబట్టడంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఆయన అన్నారు. కేంద్రాన్ని అడగడానికి రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు మొహమాట పడుతోందో అర్థం కావడం లేదని ఆయన అన్నారు.

వరదలకు పాక్షికంగా దెబ్బ తిన్న కర్నాటక రాష్టానికి, అతలాకుతలమైన మన రాష్ట్రానికి కేంద్రం సమానంగా సాయం ప్రకటించడం విడ్డూరంగా ఉందని ఆయన వ్యాఖ్యానించారు. కర్నాటకకు వేయి కోట్ల రూపాయలు, మన రాష్టానికి వేయి కోట్ల రూపాయలను కేంద్రం ప్రకటించిందని, మన రాష్ట్రం వరదలకు విపరీతంగా దెబ్బ తిన్నదని, అయినా కర్నాటకతో సమానంగానే మనకు కూడా కేంద్ర సాయం ప్రకటించారని ఆయన అన్నారు.

వరదలకు కృష్ణా, గుంటూరు జిల్లాల ప్రజలు విలవిలలాడిపోయారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. వరదల్లో పుస్తకాలు, సర్టిఫికెట్లు పోగొట్టుకున్నవారికి తక్షణమే వాటిని అందించాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి రోశయ్య బాధితులకు సాయం అందిస్తారన్న నమ్మకం తనకు ఉందని ఆయన అన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+