వైయస్సార్ కు సాటి లేరు: రోశయ్య

YS Rajasekhar Reddy
నంద్యాల: ప్రజా సంక్షేమ కార్యక్రమాలు అమలు చేయడంలో దివంగత నేత వైయస్ రాజశేఖరరెడ్డికి ఎవరూ సాటి రారని ముఖ్యమంత్రి కె.రోశయ్య అన్నారు. వరద బాధితులు తమపై ఆగ్రహం వ్యక్తం చేయడం సహజమని ఆయన అన్నారు. కర్నూలు జిల్లా నంద్యాలలో వరద బాధితులను ఆయన సోమవారం పరామర్శించారు. బాధితులను అన్ని విధాలా ఆదుకుంటామని ఆయన హామీ ఇచ్చారు. సర్వం కోల్పోయి కట్టుబట్టులతో మిగిలిన బాధితులు సరిగా సహాయం అందక ఆగ్రహం వ్యక్తం చేశారని ఆయన మీడియా ప్రతినిధులతో అన్నారు. అన్నీ బాగుంటే వారు తమపై ఆగ్రహం వ్యక్తం చేయరు కదా అని ఆయన అన్నారు.

ఇళ్లు కోల్పోయినవారికి మెరక ప్రాంతాల్లో ఇళ్లు కట్టించి ఇస్తామని ఆయన చెప్పారు. ప్రస్తుత ప్రాంతాల్లోనే బాధితులకు ఇళ్లు కట్టించి ఇవ్వడం సాధ్యం కాదని, బాధితులు సహకరించి కొత్త ఇళ్లలోకి మారాలని ఆయన అన్నారు. సుంకేశుల ప్రాజెక్టును పూర్తిచేయడానికి సహకరించాలని ఆయన ప్రజలను కోరారు. వరదల్లో ప్రజలు తమ ఆస్తులను కోల్పోయారని, అంతా తాము తెచ్చి ఇవ్వలేకపోయినా చేతనైన సాయం చేస్తామని ఆయన చెప్పారు. వ్యాపారులకు 50 వేల రూపాయల మేర పావలా వడ్డీకే రుణాలు ఇస్తామని ఆయన హామీ ఇచ్చారు. రోశయ్య వెంట మంత్రులు మాణిక్యవర ప్రసాద్, శిల్పా మోహన్ రెడ్డి, స్థానిక పార్లమెంటు సభ్యులు, శాసనసభ్యులు ఉన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+