హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

రోశయ్యను బురదలోకి లాగుతున్నారు: ఆనం

By Pratap
|
Google Oneindia TeluguNews

Anam Ramanarayana Reddy
హైదరాబాద్: తమ కాంగ్రెసు పార్టీ సీనియర్లు ముఖ్యమంత్రి రోశయ్యను కూడా బురదలోకి లాగుతున్నారని రాష్ట్ర పట్టణాభివృద్ధి మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి ధ్వజమెత్తారు. వి. హనుమంతరావు, కె.కేశవరావు, పాల్వాయి గోవర్దన్ రెడ్డి, అమోస్ తదితర సీనియర్లపై ఆయన గురువారం మీడియా ప్రతినిధుల వద్ద ఆయన విరుచుకుపడ్డారు. వారు నాయకులు కారని, లాబీయిస్టులని ఆయన వ్యాఖ్యానించారు. గతంలో తెలంగాణ బూచీని చూపి పార్టీ అధిష్టానాన్ని వారు బ్లాక్ మెయిల్ చేశారని ఆయన ఆరోపించారు.

తెలుగువారి మనస్సుల్లోంచి వైయస్ రాజశేఖర రెడ్డిని తీసేయాలని వారు ప్రయత్నిస్తున్నట్లు ఆయన ఆరోపించారు. తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస)తో వారు అవగాహనకు వచ్చారని, కాంగ్రెసు పార్టీని తెరాసకు తాకట్టు పెట్టాలని చూస్తున్నారని ఆయన వ్యాఖ్యానించారు. అది చాలా దురదృష్టకరమని ఆయన అన్నారు. వారికి ప్రజలతో సంబంధం లేదని, నాలుగు గోడల మధ్య కూర్చుంటారని ఆయన అన్నారు. అతీంద్రియ శక్తులతో అద్దంలో తాము కావాలనుకున్నదాన్ని చూస్తారని ఆయన వ్యంగ్యంగా అన్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X