హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

వరదలు మానవ తప్పిదమే: కెసిఆర్

By Pratap
|
Google Oneindia TeluguNews

K Chandrasekhar Rao
హైదరాబాద్: మానవ తప్పిదం వల్లనే రాష్ట్రంలో వరదలు సంభవించాయని తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కె.చంద్రశేఖర రావు విమర్శించారు. గురువారం పార్టీ పోలిట్ బ్యూరో, కార్యవర్గ సమావేశాల్లో ఆయన మాట్లాడారు. వరద బాధితులను ఆదుకోవడానికి మనం మన వంతు కృషి చేశామని ఆయన చెప్పారు. వరద బాధితులకు, మానవ హక్కుల నేత కె.బాలగోపాల్ కు సంతాపం ప్రకటిస్తూ సమావేశం రెండు నిమిషాల పాటు మౌనం పాటించింది.

ప్రభుత్వ వైఫల్యం వల్లనే వరదలు సంభవించాయని, వరదలను నివారించడంలో ప్రభుత్వ యంత్రాంగం పూర్తిగా విఫలమైందని కెసిఆర్ అన్నారు. మనం అందించిన సహాయం బాధితులకు సరిపోదని, ఇంకా సహాయం అందించాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు. హైదరాబాదును ఫ్రీజోన్ గా ప్రకటించేందుకు కుట్ర జరుగుతోందని, దీన్ని వ్యతిరేకిస్తూ పెద్ద యెత్తున ఉద్యమం చేపట్టాల్సి ఉందని ఆయన చెప్పారు. బాలగోపాల్ మానవ హక్కుల కోసం నిరంతరం కృషి చేశారని, తమ పార్టీ మానవ హక్కుల పరిరక్షణకు పోరాటాలు చేస్తుందని ఆయన చెప్పారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X