వరదలు మానవ తప్పిదమే: కెసిఆర్
ప్రభుత్వ వైఫల్యం వల్లనే వరదలు సంభవించాయని, వరదలను నివారించడంలో ప్రభుత్వ యంత్రాంగం పూర్తిగా విఫలమైందని కెసిఆర్ అన్నారు. మనం అందించిన సహాయం బాధితులకు సరిపోదని, ఇంకా సహాయం అందించాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు. హైదరాబాదును ఫ్రీజోన్ గా ప్రకటించేందుకు కుట్ర జరుగుతోందని, దీన్ని వ్యతిరేకిస్తూ పెద్ద యెత్తున ఉద్యమం చేపట్టాల్సి ఉందని ఆయన చెప్పారు. బాలగోపాల్ మానవ హక్కుల కోసం నిరంతరం కృషి చేశారని, తమ పార్టీ మానవ హక్కుల పరిరక్షణకు పోరాటాలు చేస్తుందని ఆయన చెప్పారు.
Story first published: Thursday, October 15, 2009, 17:21 [IST]