విశాఖపట్నం వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

మూడో రోజూ ఫ్లైట్ కు సాంకేతిక లోపం

By Pratap
|
Google Oneindia TeluguNews

Air India
విశాఖపట్నం: విశాఖపట్నంలో వరుసగా మూడో రోజు ఎయిర్ ఇండియా విమానానికి సాంకేతిక లోపం ఏర్పడింది. శనివారం ఉదయం విశాఖపట్నం నుంచి చెన్నైకి వెళ్లాల్సిన విమానం సాంకేతిక లోపం వల్ల నిలిచిపోయింది. ఢిల్లీ నుంచి విశాఖపట్నం మీదుగా చెన్నైకి వెళ్లాల్సిన విమానం శనివారం ఉదయం ఆరు గంటలకు విశాఖపట్నం చేరుకుంది. ఇక్కడి నుంచి చెన్నైకి బయలు దేరుతుండగా సాంకేతిక లోపం తలెత్తింది. దీంతో ఆ విమానాన్ని ఆపేశారు. చెన్నై నుంచి మరో విమానాన్ని రప్పించి ప్రయాణికులను తీసికెళ్లారు. ఈ విమానానికి మరమ్మతులు చేసి ఢిల్లీకి తీసికెళ్లారు.

శుక్రవారంనాడు కూడా విశాఖపట్నం నుంచి చెన్నైకి బయలుదేరిన విమానం సాంకేతిక లోపం వల్ల వెనుదిరిగి విశాఖపట్నంలో అత్యవసరంగా ల్యాండైంది. విశాఖపట్నం నుంచి బయలుదేరిన 20నిమిషాల తర్వాత తిరిగి వచ్చింది. గురువారం కూడా ఎయిర్ ఇండియా విమానానికి సాంకేతిక లోపం తలెత్తింది. శనివారం సాంకేతిర లోపం తలెత్తిన విమానమే అది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X