వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పాకిస్తాన్ లో పరిస్థితి సీరియస్: ఆంటోనీ

By Pratap
|
Google Oneindia TeluguNews

Antony
న్యూఢిల్లీ: పాకిస్తాన్ లో పరిస్థితి తీవ్రంగా ఉందని, ఉగ్రవాదం విస్తరిస్తోందని, భారత్ తాలిబన్లపై పోరాటం చేస్తుందని భారత రక్షణ మంత్రి ఎకె ఆంటోనీ అన్నారు. టెరిటోరియల్ ఆర్మీ పరేడ్ కార్యక్రమం సందర్భంగా ఆయన సోమవారం మీడియా ప్రతినిధులతో మాట్లాడారు.

భారత్ కు తాలిబన్ల నుంచి ముప్పు ఉందా అని ప్రశ్నిస్తే మన అంతర్గత భద్రతకు ఎదురయ్యే ఎటువంటి సవాల్ నైనా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నామని, మన భద్రతా బలగాలు పూర్తి అప్రమత్తతో ఉన్నాయని ఆయన జవాబిచ్చారు. ముంబై దాడుల నుంచి గుణపాఠం నేర్చుకున్నామని, దాంతో తీర ప్రాంత భద్రతా బలగాలకు, భారత నావికాదళాలకు మధ్య సమన్వయం అవసరమని గుర్తించామని, తీర ప్రాంత రక్షణకు గట్టి చర్యలు తీసుకుంటున్నామని, వాటిని పటిష్టం చేయడానికి అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నామని ఆయన చెప్పారు.

చైనా ముప్పును ఎదుర్కోవడానికి సద్ధపడ్డారా అని అడిగితే జాతీయ ప్రయోజనాల విషయంలో రాజీపడే ప్రసక్తే లేదని ఆయన సమాధానమిచ్చారు. పొరుగు దేశాలతో సంబంధాలను మెరుగుపరుచుకోవడానికి కూడా ప్రయత్నిస్తున్నామని ఆయన అన్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X