హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఎలాంటి విచారణకైనా సిద్ధమే: సీతా దయాకర్

By Pratap
|
Google Oneindia TeluguNews

Telugudesam
హైదరాబాద్: దేవరకద్ర వ్యవసాయాధికారి రాజేశ్వరి మరణంపై తాము ఎలాంటి విచారణకైనా సిద్ధమేనని తెలుగుదేశం శాసనసభ్యురాలు సీతా దయాకర్ రెడ్డి అన్నారు. తాను అజ్ఞాతంలోకి వెళ్లినట్లు వచ్చిన వార్తలను ఆమె ఖండించారు. ఆమె మంగళవారంనాడు పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడిని కలిశారు. రాజేశ్వరి ఆత్మహత్య కేసులో తనపై వచ్చిన ఆరోపణలు తొలగిన తర్వాత తెలుగు మహిళ అధ్యక్ష పదవిని చేపట్టనున్నట్లు ఆమె చెప్పినట్లు సమాచారం. రాజేశ్వరి మృతితో తనకు ఎలాంటి సంబంధం లేదని ఆమె స్పష్టం చేశారు. మంత్రి డికె ఆరుణ వ్యాఖ్యలను ఆమె విజ్ఞతకే వదిలేస్తున్నానని సీతా దయాకర్ రెడ్డి చెప్పారు.

రాజేశ్వరి ఆత్మహత్య కేసులో తాము ఎలాంటి విచారణకైనా సిద్ధమేనని మక్తల్ తెలుగుదేశం శాసనసభ్యుడు దయాకర్ రెడ్డి అన్నారు. రాజేశ్వరి మరణ వాంగ్మూలంలో సీతా దయాకర్ పేరు ఉన్నట్లు కొందరు అంటున్నారని, సీతా దయాకర్ ను అరెస్టు చేస్తారని అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారని ఆయన విమర్శించారు. రాజేశ్వరి కుటుంబాన్ని అన్ని విధాలుగా ఆదుకుంటామని ఆయన హామీ ఇచ్చారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X