టిడిపి ఎమ్మెల్యే సీతపై కేసు?

మహబూబ్ నగర్ జిల్లా దేవరకద్ర వ్యవసాయ అధికారిణి రాజేశ్వరి మరణ వాంగ్మూలంలో ఈ ముగ్గురు ప్రజా ప్రతినిధుల ఒత్తిళ్ళ కారణంగానే ఆత్మహత్యా యత్నం చేసినట్లు స్పష్టం చేసింది. ప్రజా ప్రతినిధుల ఒత్తిళ్ళను తట్టుకోలేకపోయిన తాను ఇక తన తనువును చాలించాలనే శరీరంపై కిరోసిన్ పోసుకొని నిప్పంటించుకున్నానని రాజేశ్వరి మరణవాంగ్మూలంలో స్పష్టం చేసింది. హైదరాబాద్ అపోలో ఆస్పత్రిలో రాజేశ్వరి నుంచి మరణ వాంగ్మూలాన్ని పోలీసు అధికారులు తీసుకున్నారు. రాజేశ్వరి మరణించిన నాలుగు రోజుల తరువాత ఆమె మరణ వాంగ్మూలం వెలుగు చూసింది.
దేవరకద్ర మండలంలో మంజూరైన స్ప్రింక్లర్లను తాము చెప్పిన వారికే ఇవ్వాలంటూ ఈ ప్రజాప్రతినిధులు తనపై తీవ్రం ఒత్తిడి తీసుకువచ్చి, మానసిక వేదనకు గురిచేశారని మరణవాంగ్మూలంలో రాజేశ్వరి స్పష్టం చేసింది. రాజకీయ నాయకులు చెప్పినట్లు చేస్తే అసలైన లబ్ధిదారులకు అన్యాయం జరుగుతుందని, అలా చేయకపోతే వారి నుంచి ఇబ్బందులు తప్పవన్న భయంతోనే తాను ఆత్మహత్యకు పాల్పడినట్లు రాజేశ్వరి వెల్లడించింది. తన మనుషులకు రెండు స్ప్రింక్లర్లు ఇవ్వాలని జడ్ పిటిసి ప్రదీప్ గౌడ్ ఒత్తిడి చేశారని, ఎమ్మెల్యే సీతా దయాకరరెడ్డి, ఎంపిటిసి సభ్యురాలు భారతీరెడ్డి కూడా తాము చెప్పిన వారికే స్ప్రింక్లర్లు ఇవ్వాలంటూ వేధించారని రాజేశ్వరి పేర్కొంది.
-
ఉగాదికి ముందే వారి కల నెరవేరుస్తున్న చంద్రబాబు.. మాట నిలబెట్టుకున్నారుగా! -
మొయినాబాద్ ఫాంహౌస్ డ్రగ్స్ కేసులో ట్విస్ట్ .. టీడీపీ ఎంపీ పుట్టా మహేష్కు డ్రగ్స్ పాజిటివ్! -
ఏడడుగులు వేయబోతున్న స్టార్ బ్యూటీ అనుష్క శెట్టి.. పెళ్లి కొడుకు ఫిక్స్ ?? -
ఈ నెల 15 నుంచి అశుభ దినాలు ప్రారంభం- చేయకూడని కార్యక్రమాలు -
విద్యా సంస్థలకు రేపు రెండో శనివారం సెలవు రద్దు, ఒంటి పూట బడులపై తాజా నిర్ణయం..!! -
'రాత్రి 9 దాటితే నాకు ఆ కోరిక తప్పదు!' -
ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్లో వండిన అన్నం తింటున్నారా- ఇది తెలుసుకోవాల్సిందే..!! -
పవన్ కళ్యాణ్ కొత్త మూవీలో "రౌడీ హీరో".. బాక్సాఫీస్ షేక్ పక్కా !! -
గ్యాస్ సిలిండర్ ధరలు మళ్లీ పెంపు, ఈ సారి ఎంత..!? -
వంట గ్యాస్ కొరత వేళ చంద్రబాబు కీలక ఆదేశాలు, రాష్ట్రంలో ఇక నుంచి..!! -
బీజేపీతో విజయ్ పొత్తు? తమిళ రాజకీయాల్లో ఊహించని ట్విస్ట్! -
"గోధుమ రవ్వ ఉప్మా" ఇలా చేస్తే ఇంటిల్లిపాది లొట్టలేయాల్సిందే..!












Click it and Unblock the Notifications