వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మూడు రాష్ట్రాల్లో ఓట్ల లెక్కింపు మొదలు

By Pratap
|
Google Oneindia TeluguNews

Assembly Elections
న్యూఢిల్లీ: మూడు రాష్ట్రాల శాసనసభలకు జరిగిన ఎన్నికల ఓట్ల లెక్కింపు గురువారం ఉదయం ప్రారంభమైంది. మహారాష్ట్ర, హర్యానా, అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రాల శాసనసభల ఓట్ల లెక్కింపు మొదలైంది. ఈ మూడు రాష్ట్రాలకు ఈ నెల 13వ తేదీన పోలింగ్ జరిగింది. మూడు రాష్ట్రాల్లోనూ కాంగ్రెసు ఆధిక్యంలో ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కొద్ది గంటల్లో ఫలితాలు వెలువడే అవకాశం ఉంది. ఓట్ల లెక్కింపునకు భారీ ఏర్పాట్లు చేశారు. కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు కూడా చేశారు.

మహారాష్ట్రలోని 288 స్థానాలకు గాను 267 కేంద్రాల్లో ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. ఈ రాష్ట్రంలో కాంగ్రెసు, ఎన్సీపి కూటమి విజయం సాధించే అవకాశాలున్నట్లు ఎగ్జిట్ పోల్ సర్వేలు తెలిపాయి. హర్యానాలో 90 స్థానాలకు ఎన్నికలు జరిగాయి. ఇక్కడ కాంగ్రెసు గాలి వీచే అవకాశం ఉన్నట్లు ఎగ్జిట్ పోల్ సర్వేలు తెలిపాయి. అరుణాచల్ ప్రదేశ్ లోని 60 శాసనసభా స్థానాలకు ఎన్నికలు జరిగాయి. ఈ రాష్ట్రంలో మూడు స్థానాలకు ఏకగ్రీవ ఎన్నిక జరిగింది. మిగతా 57 స్థానాలకు ఓట్ల లెక్కింపు మొదలైంది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X