జగన్ అప్పుడే అంటే బాగుండేది: కెకె

K Kesava Rao
న్యూఢిల్లీ: కడప పార్లమెంటు సభ్యుడు, దివంగత నేత వైయస్ రాజశేఖర రెడ్డి తనయుడు వైయస్ జగన్ రెడ్డి ఈ రోజు చేసిన ప్రకటన నెల రోజుల క్రితం చేసి ఉంటే బాగుండేదని కాంగ్రెసు సీనియర్ నేత కె. కేశవరావు అన్నారు. పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీని కలిసిన అనంతరం ఆయన గురువారం మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. ఆయన గురువారం సాయంత్రం నాలుగు గంటలకు సోనియా గాంధీతో సమావేశమయ్యారు.

జగన్ ఇలాగే చెప్తారని తాను ముందే ఊహించానని, మరో విధంగా చెప్తారని తాను అనుకోలేదని ఆయన అన్నారు. కొంత మంది వైయస్సార్, జగనే తమ అధిష్టానం అనే పద్ధతిలో మాట్లాడారని ఆయన అన్నారు. కొత్తగా వచ్చినవారు, ఇతర పార్టీల నుంచి వచ్చినవారు కాంగ్రెసు సంస్కృతి తెలియక ఆ విధంగా మాట్లాడారని ఆయన అన్నారు. జగన్ సోనియా నాయకత్వాన్ని అంగీకరించడం మంచి పరిణామమని ఆయన అన్నారు.

గురువారం మధ్యాహ్నం వైయస్ జగన్ సోనియాతో సమావేశమయ్యారు. ఆ తర్వాత మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. తన భవిష్యత్తును సోనియా చేతిలో పెడుతున్నట్లు ఆయన ప్రకటించారు. ఆయన మీడియా ప్రతినిధులతో మాట్లాడిన తర్వాత సోనియా పిలవడంతో కేశవరావు సాయంత్రం ఆమెను కలిశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+