వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జగన్ ను సోనియా కలుస్తారా?

By Pratap
|
Google Oneindia TeluguNews

YS Jagan
న్యూఢిల్లీ: కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్ కు ఢిల్లీలో నిరాశ తప్పేట్లు లేదు. జగన్ కు ఢిల్లీలో పరిస్థితి అంత ఆశాజనకంగా కనిపించడం లేదు. కాంగ్రెసు ఆంధ్రప్రదేశ్ వ్యవహారాల ఇంచార్జీ వీరప్ప మొయిలీతో భేటీతో ఆయనకు ఆ విషయం అర్థమైనట్లే ఉంది. కాంగ్రెసు అధ్యక్షురాలు సోనియా గాంధీ ఆయనకు అపాయింట్ మెంటు ఇవ్వడం కూడా సందేహంగానే ఉంది. జగన్ ను కలిసిన తర్వాత మొయిలీ మాట్లాడిన తీరు జగన్ ముఖ్యమంత్రి పదవిపై ఆశలు వదులుకోవాల్సిందేననే రీతిలో ఉంది. జగన్ తనను కలుస్తానని అన్నారని, తాను అందుకు ఒప్పుకున్నానని, మర్యాదపూర్వకంగానే ఆ కలయిక జరిగిందని వీరప్ప మొయిలీ అన్నారు. మొయిలీతో భేటీ అనంతరం జగన్ మీడియాతో మాట్లాడకుండానే వెళ్లిపోయారు.

కాంగ్రెసు పార్టీ ఏం చేయాలో, హైకమాండ్ ఏం చేయాలో తమకు తెలుసునని వీరప్ప మొయిలీ అన్నారు. ఎవరో చెప్పినట్లు నడుచుకోవడానికి తామిక్కడ లేమని ఆయన అన్నారు. ఒక రకంగా ఆయన కరుగ్గానే మాట్లాడారు. జగన్ కోసం రాయబారిగా కేంద్ర ఆర్థిక మంత్రి ప్రణబ్ ముఖర్జీ వద్దకు విజయవాడ పార్లమెంటు సభ్యుడు లగడపాటి రాజగోపాల్ వెళ్లారు. అయితే తాను వరదలపై మాట్లాడడానికి మాత్రమే ప్రణబ్ ను కలిసినట్లు లగడపాటి చెప్పుకున్నారు. జగన్ భేటీ తర్వాత మొయిలీని పార్లమెంటు సభ్యులు జి.వివేకానంద, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కలుసుకున్నారు. మూడు రాష్ట్రాల ఫలితాలు వచ్చిన తర్వాత నెమ్మదిగా కూర్చుని ఆలోచిస్తామని మొయిలీ చెప్పినట్లు వారు మీడియాతో చెప్పారు.

ఈ స్థితిలో జగన్ కు సోనియా గాంధీ అపాయిట్ మెంటు దొరుకుతుందా అనేది కూడా అనుమానంగానే ఉంది. ఎన్ని రోజులు జగన్ సోనియాతో భేటీకి నిరీక్షించాల్సి వస్తుందో కూడా తెలియదు. ఈ నెల 23వ తేదీ వరకు జగన్ ఢిల్లీలో ఉండే అవకాశం ఉంది. ఇష్టం వచ్చినట్లు మాట్లాడే వారిపై చర్యలు కూడా తీసుకుంటామని మొయిలీ చెప్పారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X