హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

కాంగ్రెసుపై బాధ్యత పెరిగింది: రోశయ్య

By Pratap
|
Google Oneindia TeluguNews

K Rosaiah
హైదరాబాద్: మూడు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలతో కాంగ్రెసుపై బాధ్యత మరింత పెరిగిందని రాష్ట్ర ముఖ్యమంత్రి కె. రోశయ్య వ్యాఖ్యానించారు. మహారాష్ట్ర, హర్యానా, అరుణాచల్ ప్రదేశ్ శాసనసభల ఎన్నికల్లో కాంగ్రెసు సాధించిన విజయంపై ఆయన గురువారం మీడియా ప్రతినిధుల వద్ద తన స్పందనను తెలియజేశారు. కాంగ్రెసు అధ్యక్షురాలు సోనియా గాంధీ, ప్రధాని మన్మోహన్ సింగ్ ల సమర్థ నాయకత్వానికి, మంచి పరిపాలనకు ఈ ఫలితాలు నిదర్శనమని ఆయన అన్నారు.

మూడు రాష్ట్రాల్లో కాంగ్రెసు విజయం సాధించడం ఆనందంగా ఉందని ఆయన అన్నారు. కాంగ్రెసుకు విజయం అందించినందుకు మూడు రాష్ట్రాల ప్రజలకు ఆయన తన కృతజ్ఞతలు తెలిపారు. హైదరాబాద్ ఫ్రీజోన్ కాదని శాసనసభలో తీర్మానం చేయాలనే తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావు డిమాండ్ పై ప్రతిస్పందించడానికి ఆయన నిరాకరించారు. మరే విషయాలపై కూడా ఆయన మాట్లాడడానికి ఇష్టపడలేదు. మీడియా ప్రతినిధులు ప్రశ్నలు వేస్తున్నా పట్టించుకోకుండా ఆయన వెళ్లిపోయారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X