వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పాక్ లో ఆత్మాహుతి దాడి: 7గురు మృతి

By Pratap
|
Google Oneindia TeluguNews

Bomb Blast
ఇస్లామాబాద్: పాకిస్తాన్ లో శుక్రవారం ఉదయం జరిగిన ఆత్మాహుతి దాడిలో ఏడుగురు మరణించారు. పాకిస్తాన్ లోని పంజాబ్ ప్రొవిన్స్ లో గల వ్యూహాత్మకమైన ఎయిర్ ఫోర్స్ కాంప్లెక్స్ సమీపంలో ఆత్మాహుతి బాంబర్ దాడి జరిగింది. ఈ దాడిలో ఏడుగురు మరణించారు. దాదాపు 12 మంది గాయపడ్డారు. బాంబర్ కామ్రా కంటోన్మెంట్ పాకిస్తాన్ ఎయిరో నాటికల్ కాంప్లెక్స్ కు చెందిన మొదటి చెక్ పోస్ట్ కు నడుచుకుంటూ వచ్చి తనను తాను పేల్చి వేసుకున్నాడు.

ఆ ప్రాంతంలో రోడ్డు పక్కన ఉన్న సైకిళ్లకు ఏ విధమైన నష్టం జరగలేదని ప్రత్యక్ష సాక్షులు చెప్పారు. పేలుడు సంభవించిన వెంటనే భద్రతా బలగాలు ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టాయి. ఇతర వివరాలు వెంటనే తెలియరాలేదు. దీనికి ఏ సంస్థ కూడా బాధ్యత వహిస్తూ ప్రకటన చేయలేదు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X