వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జయప్రదకు రీగిఫ్ట్: చిక్కుల్లో అమితాబ్

By Pratap
|
Google Oneindia TeluguNews

Aishwarya Rai
బారాబంకి: ఉత్తరప్రదేశ్ లోని బారాబంకిలో తలపెట్టిన బాలికల కళాశాల విషయంలో బిగ్ బి, బాలీవుడ్ నటుడు అమితాబ్ బచ్చన్ మరోసారి వివాదంలో చిక్కుకున్నారు. ఈ కళాశాల భవంతి నిర్మాణం విషయంలో ఒప్పందాన్ని ఉల్లంఘించారని అమితాబ్ పై ఆరోపణలు వస్తున్నాయి. ఈ కళాశాల ఏర్పాటు గురించి నిరుడు జనవరిలో అమితాబ్ ప్రకటన చేశారు. అయితే ఈ కళాశాలకు ఉద్దేశించిన భూమిని సినీ నటి, సమాజ్ వాదీ పార్టీ పార్లమెంటు సభ్యురాలు జయప్రద నడుపుతున్న ప్రభుత్వేతర సంస్థకు తిరిగి గిఫ్ట్గ్ గా రాసిచ్చినట్లు చెబుతున్నారు.

బచ్చన్ అవకతవకలకు పాల్పడ్డారని, భూమిని రీగిప్ట్ చేశారని దౌలతాపూర్ గ్రామాధిపతి ఆరోపిస్తున్నారు. కళాశాల నిర్మాణానికి శంకుస్థాపన చేశారని, అయితే ఈ విషయంలో ఏ విధమైన ప్రగతి సాధించలేదని అంటున్నారు. అభిషేక్ బచ్చన్, జయా బచ్చన్, ములాయం సింగ్ యాదవ్, అమర్ సింగ్ ఈ శంకుస్థాపన కార్యక్రమానికి హాజరయ్యారు.

ఈ భూమి విషయంలో అమితాబ్ వివాదంలో చిక్కుకోవడం ఇదే మొదటిసారి కాదు. అమితాబ్ కు ఆ భూమిని ములాయం సింగ్ యాదవ్ అక్రమంగా కేటాయించారని ఆరోపిస్తూ కోర్టులో కేసు నడిచింది. ఆ కేటాయింపును కోర్టు రద్దు చేసింది. దీంతో ఆయన ఆ భూమిని రైతుల నుంచి ఆయన కొనుగోలు చేశారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X